NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిత్య కళ్యాణ మూర్తుల బ్రహ్మోత్సవం ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కమలాపురం : మండలంలోని శ్రీ రామాపురం మహా పుణ్యక్షేత్రంలో వెలసిన నిత్య కళ్యాణ మూర్తులైన శ్రీమహా లక్ష్మి సమేత మోక్ష నారాయణ స్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాశీభట్ల సాయి నాథ శర్మ తెలిపారు. మొదటి రోజున స్వామివారికి సుప్రభాత పూజ, గణపతి పూజ అభిషేకాలు, గావించారు, అలాగే వేద పండితులతో దేవతామూర్తుల కు ప్రత్యేక అలంకరణలు, ఆలయంలో హోమాలు నిర్వహించారు. అదేవిధంగా ధ్వజారోహన,తదుపరి మాడ వీధుల్లో శ్రీ స్వామి అమ్మవార్ల కు ఊరేగింపు కార్యక్రమం చేశారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి, భక్తులకు స్వామి వార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు.

About Author