PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పూర్ణాహుతితో ముగిసిన బ్రహ్మోత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: మహానంది క్షేత్రం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో ముగిశాయి .ఈవో  చంద్రశేఖర్ రెడ్డి ,చైర్మన్ మహేశ్వర్ రెడ్డి వేద పండితులు రవిశంకర్ అవధాని ,నాగేశ్వర శర్మ ,శాంతారాం బట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రోచ్ఛారణలు మంగళ వాయిద్యాల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు .బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు వేద పండితులు తెలిపారు .ధ్వజ అవరోహణం చేసి సాయంత్రం కోనేటిలో తెప్పోత్సవం నిర్వహించారు.ఆలయ సిబ్బంది అర్చకులు ఉల్లాసంగా పాల్గొన్నారు  .ప్రతినిత్యం ప్రతిరోజు మహానది దేవస్థానం లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి కూరగాయలు అందజేస్తున్న దాత ప్రసాద్ దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author