PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముగిసిన నిత్య కళ్యాణమూర్తుల బ్రహ్మోత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కమలాపురం: మండలంలోని శ్రీ రామాపురం క్షేత్రంలో వెలసిన శ్రీ మహాలక్ష్మి సమేత మోక్ష నారాయణ స్వామి మరియు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ముగిసాయి. 24 నుండి 28 వరకు ఐదు రోజుల పాటు వైభవోపేతంగా కరోనా నిబంధనలు పాటిస్తూ వేద పండితుడు జూటూరు నరసింహ స్వామి నేతృత్వంలో శాస్త్రోక్తంగా నిత్యకళ్యాణ మూర్తుల బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. చివరి రోజు శుక్రవారం దుర్గా సప్త శతి, మహా పూర్ణాహుతి , మహా కుంభాభిషేకం, కళ్యాణ మూర్తులు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా కల్యాణ మూర్తులకు చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిసాయి. భూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆలయ నిర్వహణ ఆలయ ప్రధాన సేవకులు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ కుటుంబ సభ్యులు, భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author