PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ పార్టీని చీల్చొద్దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట‌మికి.. గాంధీ కుటుంబ నాయకత్వం మాత్ర‌మే బాధ్యుల్ని చేయ‌డం సరికాదని అన్నారు. పరాజయం బాధ్య‌త నుంచి ఎవరు పారిపోవ‌డం లేద‌ని.. ఓట‌మికి తాము బాధ్య‌త వ‌హిస్తున్నామ‌ని గాంధీ కుటుంబం ప్ర‌క‌టించింద‌ని గుర్తుచేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ఓట‌మికి తానూ బాధ్య‌త వ‌హిస్తున్నాన‌ని చిదంబరం తెలిపారు. అదే విధంగా మిగ‌తా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓట‌మికి కూడా ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యనేతలు బాధ్య‌త వ‌హిస్తున్నార‌ని చెప్పారు. జీ 23 గ్రూప్‌ నేత‌లు త‌మ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీని చీల్చ‌డానికి ప్రయత్నం చేయవద్దని చిదంబరం విజ్ఞ‌ప్తి చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక ఆగస్ట్‌లో జరిగే అవకాశం ఉందని, అప్పటివరకు సోనియా గాంధీనే నాయకత్వం వహిస్తారని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

                              

About Author