దివ్యాంగుల పునరావాస కేంద్రంలో అల్పాహారం పంపిణీ
1 min read
జానబ్ అబ్బు భాయ్,రహమ తున్నిసా బేగం దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమం
పదిమందికి ఆకలి తీర్చడoలో ఆత్మ సంతృప్తినిస్తుంది
50 మంది వితంతు,వృద్ధ మహిళలకు నిత్యవసర సరుకులు పంపిణీ
షేక్ సయ్యద్ బాజీ రాష్ట్ర నూరు బాషా ముస్లిం మైనార్టీ అధికార ప్రతినిధి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బర్కాతుహు ఆశీస్సులతో ఏలూరు దత్తాత్రేయ ఆశ్రమం రోడ్డు దొండపాడు వద్ద జిల్లా దివ్యాంగుల పునరవాస కేంద్రం లో మంగళవారం ఉదయం ఏడు గంటలకు టిఫిన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం జనాబ్ అబ్బు భాయ్ సతీమణి రహమతున్నిసా బేగం ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ కార్యక్రమం జరిగింది. తమకు ఉన్న దానిలో పదిమందికి ఆకలి తీర్చే విధంగా సహాయం అందించటం ద్వారా ఆత్మ తృప్తి పొందుతామన్నారు. గొలుసుల పంజా ముజావర్ ఎండి గాలబ్ అలి మరియు నన్నా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఏలూరు అశోక్ నగర్ లో వితంతు మహిళలకు వృద్ధ మహిళలకు బుధవారం నిత్యవసర సరుకులు సుమారు 50 మందికి షేక్ సయ్యద్ బాజీ (గాజుల బాజీ) రాష్ట్ర నూరు భాషా ముస్లిం మైనార్టీ అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు నూరు బాషా ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ సత్తార్, షేక్ బాషా, షేక్ షరీఫ్ షేక్ బాజీ మరియు ఇతర హిందూ సోదర సోదరీమణుడు పాల్గొన్నారు.