PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెళ్లి జరిగిన కాసేపటికే షాకింగ్ న్యూస్: కుప్పకూలిన పెళ్లికొడుకు తండ్రి

1 min read


పల్లెవెలుగు వెబ్: పెళ్లి వైభవంగా జరిగింది. ఇంతలోనే ఓ వార్త పెళ్లింట విషాదాన్ని నింపింది. అయితే అంతలోనే మరో ఘోరం చోటుచేసుకుంది. విషాద వార్త విన్న పెళ్లి కుమారుడు తండ్రి కుప్పకూలాడు. బంధువులందరూ వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పెళ్లి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడుకు చెందిన వెంకటస్వామి… పామిడి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్నారు. నిన్న ఆయన కుమారుడు గోవర్ధన్ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటస్వామి తల్లి కోన్నమ్మను ఇటీవల అనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే వివాహం ముగిసిన కాసేపటికే ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. చికిత్స పొందుతున్న తల్లి మరణించిందన్న వార్త విన్న వెంకటస్వామి హఠాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన బంధువులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. తల్లి, కుమారుడు ఒకేరోజు మరణించడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది.

About Author