PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువతలో చైతన్యం తీసుకురావాలి.. టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్​ కర్నూలు : కర్నూలు భవిష్యత్తు ఎలా ఉండాలో యువత ఆలోచించుకోవాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని మౌర్య ఇన్ లో పలు వార్డులకు చెందిన మహేష్ బాబు అభిమానులు అమీర్ ఖాన్, షాఫుద్దీన్, యూనుస్ టీంలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి టిజీ భరత్ కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. కర్నూల్లో పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని భరత్ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. యువత ఆలోచించి సరైన వ్యక్తికి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాము కర్నూలును డెవలప్మెంట్ చేసేందుకే రాజకీయాల్లో ఉన్నట్లు చెప్పారు. నగరంలోని యువతలో చైతన్యం తీసుకురావాలని ఫ్యాన్స్ కు చెప్పారు. ఈ కార్యక్రమంలో 6 వ వార్డు ఇంచార్జి ఇబ్రహీం, టిడిపి మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ భాష, నేతలు మెహబూబ్, నయీం, సలీం ఖాన్, జుబేర్ ఆలీ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

About Author