NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం… టిడిపి నేతలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగరంలోని వీధివీధిలో తిరుగుతూ ప్రజల్లో చైతన్యం తెస్తున్నామని టిడిపి నగర కమిటీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్, పార్టీ నేతలు అన్నారు. శుక్రవారం నగరంలోని 12 వ వార్డులోని బాపూజీ నగర్, వడ్డెగేరి, కె.వి.ఆర్ గార్డెన్స్ లో తెలుగుదేశం పిలుస్తోంది నగరమా మేలుకో కార్యక్రమం చేపట్టారు. ప్రజలను కలిసి ఈ ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని వివరించినట్లు నేతలు చెప్పారు. ఇప్పటికైనా ప్రజలు గ్రహించి మేల్కోవాలని కోరుతున్నట్లు తెలిపారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ అందాలంటే టిడిపి గెలవాలన్నారు. కర్నూలుకు టి.జి భరత్ ఎమ్మెల్యే అయితే అభివ్రుద్ది ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి చిన్నమ్మ, క్లస్టర్ ఇంచార్జి ఈశ్వర్, నేతలు తిరుపాల్ బాబు, తారనాథ్, పెంచలయ్య, పండు, మాధవ్, విజేత, ఆనంద్, శ్రీనివాసులు, వినోద్, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About Author