PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ‘బ్రో- ది అవతార్’..

1 min read

ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగులో!

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆసక్తికరమైన సీరియల్స్ తోపాటు వినోదభరితమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ వారం మరో బ్లాక్బస్టర్ సినిమాతో మీ ముందుకు రానుంది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా బ్రో- ది అవతార్ను అక్టోబర్ 15, ఆదివారం సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అందించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా పవర్ స్టార్ అభిమానులను మరో సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది జీ తెలుగు హైదరాబాద్ లోని నక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా వద్ద అక్టోబర్ 10, మంగళవారం సాయంత్రం అభిమానులు, మీడియా సమక్షంలో యాభై నాలుగు అడుగుల పవన్ కల్యాణ్ భారీ కటౌట్ను ఆవిష్కరించింది. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా థియేటర్లలో విడుదలైన బ్రో ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్స్ టాక్ అందుకుంది. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు సముద్రఖని రూపొందించారు. పవన్ స్టార్ పవర్ ప్యాక్డ్ యాక్టింగ్తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లతో పాటు ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, రాజా చెంబోల్, రోహిణి మొల్లెటి, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా రానున్న బ్రో సినిమాను మీరూ మిస్సవకండి!

About Author