PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీఆర్ఎస్ ఉంటే వైసీపీకే మంచిది

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీ పై స్పందించారు. ఏపీలో ఉన్న వివిధ పార్టీల మాదిరే బీఆర్ఎస్ కూడా ఒక పార్టీగా ఉంటుందని చెప్పారు. ఏపీలో ఎన్ని పార్టీలు ఉంటే వైసీపీకి అంత మంచిదని అన్నారు. ఇదే సమయంలో అమరావతి రైతుల పాదయాత్రపై ఆయన విమర్శలు గుప్పించారు. ఎవరి కోసం ఈ పాదయాత్ర చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు, రియలెస్టేట్ వ్యాపారుల కోసం పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. మూడు రాజధానులే తమ ప్రభుత్వ వైఖరి అని చెప్పారు. ఉత్తరాంధ్రకు గత టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీతో చర్చకు సిద్ధమని అన్నారు.

                                

About Author