NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తంత్ర‌గాళ్ల స‌ల‌హాతోనే బీఆర్ఎస్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: మంత్ర, తంత్రగాళ్లు ఇచ్చిన సలహా వల్లే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ‘సెంటిమెంట్‌ వల్లే టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. కానీ అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా టీఆర్‌ఎస్ ను బీఆర్‌ఎస్ గా మార్చుతున్నారు. దాని వల్ల ఎవరికి ప్రయోజనం? న్యాయం ఏం జరుగుతుంద’ని నిర్మల ప్రశ్నించారు. భారత రాష్ట్ర సమితి అయ్యిందే తప్ప భారత జాతీయ సమితి కాలేదని, తెలుగు కూడా కాదని సంస్కృతం పేరు పార్టీకి పెట్టారన్నారు. మంత్ర, తంత్రాలు చేేసవారు సచివాలయానికి వెళ్లొద్దని, మంచి జరగదని కేసీఆర్‌కు చెప్పడంవల్లే ఆయన వెళ్లడం లేదన్నారు.

                                               

About Author