PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తొమ్మిదో డివిజన్ ఫిలాస్ పేటలో శరవేగంగా బీ.టీ రోడ్డు పనులు

1 min read

పనులను పరివేక్షిస్తున్న కార్పొరేటర్ సబ్బన శ్రీనివాస్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : అభివృద్ధికి, సంక్షేమనికి మారుపేరుగా నిలిచే  జగనన్న అభివృద్ధి పనులలో భాగంగా రాష్ట్రంలో ప్రజలు ఏ ఇబ్బంది పడకుండా అనేక అభివృద్ధి పనులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేక పనులకు శ్రీకారం చుడుతున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల నాని సారధ్యంలో ప్రజలు ఏ ఇబ్బంది పడకుండా ఏలూరు నియోజకవర్గం లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్థానిక తొమ్మిదో డివిజన్ తూర్పు వీధి ఫిలాస్ పేట లో బీ.టీ రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపదికపై శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను సిబ్బందిని అప్రమత్తం చేస్తూ  కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు.

About Author