NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తెలుగు మీడియంలో బీటెక్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తెలుగు తోపాటు 11 ప్రాంతీయ భాష‌ల్లో బీటెక్ కోర్సులు బోధించేందుకు అఖిల భార‌త సాంకేతిక విద్యా మండ‌లి (ఏఐసిటీఈ) అనుమ‌తించిన‌ట్టు కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. తెలుగుతో పాటు హిందీ, మ‌ల‌యాళం, క‌న్నడ‌, త‌మిళం, ఒడియా, పంజాబీ, బెంగాళీ, అస్సామీ, మ‌రాఠి, గుజ‌రాతీ భాష‌ల్లో ఇక నుంచి బీటెక్ కోర్సులు బోధించ‌నున్నారు. ప్రాంతీయ భాష‌ల ప్రోత్సాహీనికి ప్రధాని న‌రేంద్ర మోదీ చిత్త‌శుద్ధితో ఉన్నార‌ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈ నిర్ణయం ప‌ట్ల ఉప‌రాష్ట్ర ప‌తి వెంక‌య్య నాయుడు హ‌ర్షం వ్యక్తం చేశారు.

About Author