NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ‌డ్జెట్.. ఏపీ కేబినెట్ ఆమోదం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ కేబినెట్ బ‌డ్జెట్ కు ఆమోదం తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను సాధారణ బడ్జెట్‌‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈరోజు ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మరికాసేపట్లో అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. తరువాత వ్యవసాయ అనుబంధ రంగాలపై బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. మండలిలో సాధారణ బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రవేశపెట్టనున్నారు.

                                             

About Author