NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బుగ్గన అబ‌ద్దాలు ఆడుతున్నారు : ప‌య్యావుల‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : బ్యాంకుల పూచీక‌త్తుపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అబ‌ద్ధాలు ఆడుతున్నార‌ని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశ‌వ్ ఆరోపించారు. బ్యాంకుల గ్యారంటీల‌ గురించి శాస‌న‌స‌భ‌లో దాచార‌ని విమ‌ర్శించారు. బ్యాంకుల గ్యారంటీల‌పై ప్రశ్న అడిగితే.. ఏడాది త‌ర్వాత జ‌వాబు చెబుతున్నార‌ని, 25వేల కోట్ల బ్యాంకు గ్యారంటీలు తెలియ‌కుండా దాచార‌ని ఆయ‌న అన్నారు. త‌న ఆరోప‌ణ‌ల‌పై ప్రభుత్వం స‌రిగా జ‌వాబు చెప్పలేద‌ని విమ‌ర్శించారు. ఢిల్లీ వెళ్లి వాస్తవాలు వివ‌రిస్తామ‌ని చెప్పారు. ఢిల్లీ చుట్టూ ఎవ‌రు ప్రదక్షిణ‌లు చేస్తున్నారో అంద‌రికీ తెలుస‌న్నారు.

About Author