NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బుజ్జగించడానికి బుగ్గన.. బెదిరించడానికి బొత్స !

1 min read

పల్లెవెలుగువెబ్ : రెండు నెలలు జీతాలు ఇవ్వకపోతే వారే దారికి వస్తారని ఉద్యోగులను అవమానించేలా కొందరు మాట్లాడుతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ పై ఉద్యోగులను బుజ్జగించడానికి బుగ్గన, నమ్మించడానికి నాని, సర్దిచెప్పడానికి సమీర్ శర్మ, సర్దుకోమనడానికి సజ్జల, బెదిరించడానికి బొత్సతో కమిటీ వేశారని ఆయన అన్నారు. రెండు నెలలు జీతాలు ఇవ్వకపోతే ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడుతుందని, దీంతో కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనవసర ప్రకటనలు, తప్పుడు సమాచారంతో ప్రజలు, ఉద్యోగుల మధ్య అగాధం సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో రోడ్లు బాగుపరిచిన తర్వాత విమానాశ్రయాల గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు.

      

About Author