PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 ఆదోని– ఆలూరు మధ్య బైపాస్​ రోడ్డు నిర్మించండి : ఎంపీ. డా. సంజీవ్​ కుమార్​

1 min read

పల్లెవెలుగు వెబ్​:  కర్నూలు పార్లమెంట్​ పరిధిలోని ఆదోని– ఆలూరు మధ్య బైపాస్​ రోడ్డు నిర్మించాలని ఎంపీ. డాక్టర్​ సంజీవ్​ కుమార్​ కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిధర్​ ఆర్మనేకు విన్నవించారు. ఆదోని పట్టణం మీదుగా వెళ్తున్న 167 జాతీయ రహదారి భద్రత ఆందోళన కలిగించే విధంగా ఉందని,  ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఆదోని– ఆలూరు మధ్య బైపాస్​ నిర్మించాలని విన్నవించారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన గిరిధర్​ ఆర్మనే  సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ డా. సంజీవ్​ కుమార్​ వెల్లడించారు.

About Author