PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘జగనన్న కాలనీ’ లో ఇళ్లను త్వరగా నిర్మించండి

1 min read

– విద్యుత్​ కనెక్షన్​, లే అవుట్​ పనులు పూర్తి చేయండి
– ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు
పల్లెవెలుగువెబ్​, చిట్వేల్​: రాష్ట్రంలో ప్రతి పేదవాడికి గూడు ఉండాలన్న సంకల్పంతో సీఎం వైఎస్​ జగన్ మోహన్​ రెడ్డి ‘ వైఎస్సార్​జగనన్న కాలనీ’పేరిట ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని, ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్​ కొరముట్ల శ్రీనివాసులు కోరారు. చిట్వేల్​ పట్టణ పేదలకు హరిజన వాడ వద్ద వైఎస్సార్​ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా అధికారులు చొరవ చూపాలని కోరారు. బుధవారం హరిజనవాడ వద్ద నున్న జగనన్న కాలనీ హౌసింగ్​ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. కాలనీలో ఇళ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని అధికారులును ఆదేశించారు. ఈ లే అవుట్ 200 మంది కి ప్లాట్స్ ఇవ్వడం జరిగిందని, సిసి రోడ్డు, త్రాగునీటి వసతులు కల్పన, భూగర్భ డ్రైనేజీ , రహదారుల నిర్మాణాలకు, చేపట్టాలన్నారు. లే అవుట్ లో అధిక సంఖ్యలో మొక్కలు నాటేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, హౌసింగ్ డిఈ, మహేష్ రెడ్డి , ధ్వజ రెడ్డి , కిషోర్ రెడ్డి, నరసింహ, మండల నాయకులు పాల్గొన్నారు.

About Author