PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాలువలు, డ్రెయినేజీ… నాణ్యతగా నిర్మించండి

1 min read

– పాణ్యం ఎమ్మెల్యే కాటసాని
పల్లె వెలుగు కల్లూరు అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం నిర్మించే కాలువలు, డ్రెయినేజీలు నాణ్యతగా నిర్మించాలని కాంట్రాక్టర్​ను ఆదేశించారు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి. కల్లూరు అర్బన్ 41 వ వార్డు విగ్నేశ్వర నగర్ లో దాదాపు 38 లక్షల రూపాయల వ్యయంతో కాలువలు, డ్రైనేజీల నిర్మాణం కోసం శుక్రవారం ఎమ్మెల్యేతోపాటు నగర మేయర్​ బీవై రామయ్య, డిప్యూటీ మేయర్​ సిద్ధారెడ్డి రేణుక శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరించారు. కార్యక్రమంలో 41 వ వార్డ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ శ్వేతారెడ్డి , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి హనుమంతు రెడ్డి , ఇంకా 41వ వార్డులోని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

About Author