PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి వ‌స్తే భ‌వ‌న నిర్మాణ రంగానికి పూర్వ వైభ‌వం..

1 min read

క‌ర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్

టిడిపిలో చేరిన 11వ వార్డుకు చెందిన యువ‌త‌

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం ప్రభుత్వం వ‌స్తే భ‌వ‌న నిర్మాణ రంగానికి పూర్వ వైభ‌వం వ‌స్తుంద‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని మౌర్య ఇన్‌లో 11వ వార్డుకు చెందిన యువ‌కులు హైద‌ర్ హుశేన్, ఫిరోజ్‌, త‌దిత‌రులు తెలుగుదేశం పార్టీలో చేరారు. టి.జి భ‌ర‌త్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో గౌండాప‌నులు, సెంట్రింగ్ ప‌నులు లేక కార్మికులు ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. టిడిపి వ‌స్తే ఉచిత ఇసుక విధానం తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. క‌ర్నూల్లో త‌న‌ను గెలిపిస్తే న‌గ‌రం మొత్తం బాగుప‌డేలా ప‌ని చేస్తాన‌ని చెప్పారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రిగేలా ప‌రిపాల‌న సాగిస్తాన‌ని హామీ ఇచ్చారు. క‌ర్నూల్లో కులం, మ‌తం అని చూడ‌కుండా ప్రజ‌లంద‌రికీ సేవ చేసే త‌న‌ను గెలిపించాల‌ని కోరారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కేవ‌లం కులం చూసి ఓటేయ‌మ‌ని అడుగుతార‌న్నారు. తాను మాత్రం మేం చేసిన సేవా కార్యక్రమాలు చెబుతూ, భ‌విష్యత్తులో ఏం చేస్తామో చెబుతూ ఓట్లు వేయ‌మ‌ని కోరుతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. అందుకే యువ‌కులు ఆలోచించి త‌న‌కు మ‌ద్దతివ్వాల‌ని చెప్పారు. తాను రూపొందించిన 6 గ్యారెంటీలు పూర్తి చేయ‌డం వ‌ల్ల క‌ర్నూలు రూపురేఖ‌లు మారిపోతాయ‌న్నారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్, ఇంజార్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author