PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. హౌస్‌ బిల్డింగ్‌ అడ్వాన్స్‌(హెచ్‌బీఏ) రుణ వడ్డీ రేటును 7.9 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించింది. ఈ తగ్గిన వడ్డీ రేట్లకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హెచ్‌బీఏను పొందవచ్చని కేంద్రం వెల్లడించింది. తాజాగా అందుకు సంబంధించిన మార్గదర్శకాలను మినిస్టీ ఆఫ్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌ మంత్రిత్వ శాఖ ఏప్రిల్1న విడుదల చేసిన మెమోరాండంలో పేర్కొంది. ఇక సవరించిన వడ్డీ రేట్లు ఈ ఏడాది ఏప్రిల్‌1 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు అందుబాటులో ఉంటాయి. దీంతో ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2022-2023లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉండనుంది. ఇక సవరించిన వడ్డీ రేట్లు మార్చి 2022 వరకు 7.9 శాతంగా ఉన్న విషయం తెలిసిందే.

                                       

About Author