NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లోయ‌లో ప‌డ్డ బ‌స్సు.. 19 మంది మృతి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాకిస్థాన్ లోని బలూచిస్తాన్‌లో ఘోరం జ‌రిగింది. ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 11 మంది గాయాలపాలయ్యారు. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు..జోబ్‌లోని లోయలో పడిపోయింది. భారీ వర్షం కురుస్తుండటంతో మలుపు వద్ద బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి ఘోరం సంభవించిందని అధికారులు తెలిపారు. కాగా, రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ మూలంగా పాకిస్తాన్‌లో ప్రమాదాలు సాధారణమయ్యాయి.

                                               

About Author