PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సైకో వీరంగం బస్సు, కార్ల అద్దాల ధ్వంసం             

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ పట్టణంలో ఒక సైకో చేసిన వీరంగం స్థా నికుల్లో దడ పుట్టించింది. పోలీస్ స్టేషన్ ఎదిటే సైకో ఇనుప రాడుతో బస్సు, కార్ల అడ్డాల ధ్వంసం చేస్తూ, బీభత్సం సృష్టించాడు. చివరికి పోలీస్ స్టేషన్ పై కూడా దాడికి పాల్పడ్డాడు. అడ్డు వచ్చిన వారిపై సైతం దాడికి పాల్పడ్డాడు. అడ్డుపడిన బస్సు కండక్టర్ పై దాడి చేసి రక్తం కారేటట్లు కొట్టాడు. అరగంట పాటు సైకో చేసిన వీరంగం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. సైకో చేసిన వీరంగానికి భయపడి పోలీసులు కూడా దగ్గరకు రాలేదు. ఒక దశలో సైకో పోలీస్ స్టేషన్ పై కూడా దాడికి దిగాడు. పోలీస్ స్టేషన్ కు తలుపులు వేయగా పోలీస్ స్టేషన్ తలుపులను సైతం బద్దలు కొట్టడానికి ప్రయత్నించాడు. పోలీస్ స్టేషన్లో ఉన్న కుర్చీలను ఇనుపరాడుతో ధ్వంసం చేశాడు.  చివరికి అక్కడే ఉన్న కొందరు యువకులు సాహసం చేసి సైకోను కట్టడి చేసి, బంధించగలిగారు. సైకో హోసూర్ కు చెందిన అల్లిపీరా అనబడే వ్యక్తిగా గుర్తించారు. ఇతను సైకో గా మారి భార్యను సైతం ఇటీవల హతమార్చినట్లు అనుమానాలు ఉన్నాయి. గతంలో ఇతను చేసిన సైకో పనులకు పోలీసులు విశాఖకు తరలించిన ఘటన ఉంది. అక్కడి నుండి తిరిగి సొంతూరుకు వచ్చి ఇలాంటి పిచ్చి పనులకు పాల్పడుతున్నాడు. ఇప్పటికైనా పోలీసులు ఇతనిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.   

About Author