PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్ ఎం ఏ ఫిష్ కంపెనీ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

1 min read

స్వచ్ఛంద సంస్థలు,దాతల సహకారంతో పలు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి

ఇడా చైర్ పర్సన్ బొద్దాని శ్రీనివాస్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు గజ్జెల వారి చెరువు ఫిష్ మార్కెట్ నందు మాజి ఉప ముఖ్యమంత్రి మరియు ఏలూరు జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు  ఆళ్ల నాని  ఆశీసులుతో వేసవి దృశ్య  మంగళవారం ఎస్.ఎం.ఏ. ఫిష్ కంపెనీ  వారి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. ఈ ప్రారంబొత్సావానికి ముఖ్యఅతిథిగా  ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్ధాని శ్రీనివాస్  చేతుల మీదుగా మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గజ్జెలవారి చెరువు చేపల మార్కెట్ షాప్స్ యాజమాన్యం మరియు వ్యాపారులు వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రచండ భానుడి ప్రతాపం నగరవాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అత్యవసర పొడల మీద తప్పని పరిస్థితుల్లో బయటికి వచ్చే వారి కోసం స్వచ్ఛంద సంస్థలు, మరియు దాతల విరాళాలతో  ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుందని  అన్నారు. తప్పని పరిస్థితుల్లో బయటికి వచ్చేటప్పుడు క్యాప్, మాస్క్  వీలైతే వాటర్ బాటిల్ ఇలా పలు జాగ్రత్తలతో బయటకు రావాలని సూచించారు.

About Author