NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్నిక‌ల నాటికి ఏపీలో రూ. 10 ల‌క్ష‌ల కోట్ల అప్పు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీడీపీ సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ‘‘జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే నాటికి బడ్జెటేతర అప్పులతో కలిపి రుణం రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుంది. పొంతనలేని అప్పుల కారణంగా చెల్లింపుల భారమే ఏడాదికి రూ.లక్ష కోట్లు అవుతుంది. తా ను మళ్లీ అధికారంలోకి వచ్చే అవకావశం లేదనే ఉద్దేశంతోనే జగన్‌రెడ్డి భవిష్యత్తులో రాష్ట్రం తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని చూస్తున్నాడు’’ అని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

                                

About Author