PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గం సమావేశమై బడ్జెట్, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో లోక్ సభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం. కరోన ఉధృతి, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈసారి బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానంగా ఆరోగ్య రంగానికి బడ్జెట్ లో అధికంగా ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కేబినెట్ ఆమోదానికి ముందు నిర్మలాసీతారామన్ బడ్జెట్ ట్యాబ్ తో రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ ను వివరించారు.

    

About Author