PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెటిల్మెంట్ కు పిలిచి… షూట్ చేశారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ లో దారుణం జ‌రిగింది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగుడాలో కాల్పులు కలకలం రేగింది. కర్ణంగుడా గ్రామ సమీపంలో సెటిల్మెంట్‌కు పిలిచి రఘు, శ్రీనివాస్ అనే ఇద్దరు రియల్టర్ల పైన సుపారీ గ్యాంగ్ కాల్పులు జరిపింది. స్పాట్‌లోనే శ్రీనివాస్ మృతి చెందగా.. రఘు తీవ్ర గాయాలపాలయ్యాడు. రియల్టర్లకు చెందిన స్కార్పియో వాహనంపై సైతం రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. సెటిల్మెంట్‌కి పిలిచి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి రఘు వెళ్లినట్టు తెలుస్తోంది. సుపారీ గ్యాంగ్ కాల్పులు జరిపింది. సీసీ కెమెరాలు, కాల్ డేటా ఆధారంగా పోలీస్ విచారణ కొనసాగుతోంది.

                                          

About Author