PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ర‌ద్దు చేయండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు గంగిరెడ్డికి సెషన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ మొదట హైకోర్ ను సీబీఐ ఆశ్రయించింది. కాగా… సీబీఐ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వైఎస్ వివేకా హత్య కేసులో దాఖలైన ఛార్జిషీటులోనూ గంగిరెడ్డిని సీబీఐ ఏ1గా చేర్చింది. సీబీఐ పిటిషన్‌పై త్వరలో సుప్రీంలో విచారణ జరుగనుంది.

                                               

About Author