NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్యాన్సర్​ మరణాలు తగ్గించాలి

1 min read

రొమ్ము, అండాశయ క్యాన్సర్లను ముందస్తుగా గుర్తించి.. వైద్యం అందించాలి

  •  ప్రభుత్వ మెడికల్​ కాలేజి ప్రిన్సిపల్​ డా. చిట్టి నర్సమ్మ
  • ఓమెగా హాస్పిటల్​ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు  

కర్నూలు, న్యూస్​ నేడు:మహిళలకు ప్రబలుతున్న రొమ్ము, అండాశయ క్యాన్సర్లను ముందస్తుగా గుర్తించి… వారి జీవన ప్రమాణాలు పెంచేలా వైద్యం అందించాలని సూచించారు ప్రభుత్వ మెడికల్​ కాలేజి ప్రిన్సిపల్​ డా. చిట్టి నర్సమ్మ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని ఐఎంఏ భవన్​ లో ఓమెగా హాస్పిటల్​  ఆధ్వర్యంలో క్యాన్సర్​ చికిత్స, తదితర అంశాలపై జూనియర్​ వైద్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మెడికల్​ కాలేజి ప్రిన్సిపల్​ డా. చిట్టి నర్సమ్మ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్​ డా. వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. ముందస్తు వైద్య పరీక్షలు  మరియు చికిత్స విధానాలలో పరిశోధనల ద్వారా లక్ష్యాలను సాధించవచ్చన్నారు.  అనంతరం ఓమెగా క్యాన్సర్​ హాస్పిటల్​ వైద్యులు సీనియర్​ సర్జికల్​  అంకాలజిస్టు ​డా.బి రవీంద్ర బాబు , సీనియర్​ రేడియోషన్​ అంకాలజిస్టు డా. వెంకట రెడ్డి, డా. ఉమా మహేశ్వర రెడ్డి, మెడికల్​ అంకాలజిస్టు డా. సుధాకర్ , ఐఎంఏ వైద్యులు డా.  ఆర్​సి నాయుడు,  ప్రెసిడెంట్​  మరియు డా. మాధవి , ట్రెజరర్​ ఐఎంఏ మాట్లాడారు.  ఈ సదస్సులో కర్నూలు, నంద్యాల, హైదరాబాద్​ , గుంటూరు మరియు వైజాగ్​ నుంచి ప్రముఖ క్యాన్సర్లు వైద్యులు పాల్గొన్నారు.  డా. నాగ కిశోర్​,  డా. రవి శంకర్​ సీనియర్​ క్యాన్సరు వైద్యులు , ఓమెగా హాస్పిటల్​  డా. ప్రకాశ్​,  డైరెక్టర్​,  స్టేట్ క్యాన్సర్​ ఇన్సిస్ట్యూట్​ కర్నూలు  పాల్గొని, ఆధునాతన శస్ర్త చికిత్స  విధానాలు, మన భారత దేశంలో స్త్రీలలో ప్రబలుతున్న  రొమ్ము, అండాశయ  మరియు గర్భసంచి  క్యాన్సర్ల గురించి చర్చించారు.  ఈ వ్యాధిని ప్రాథమిక  దశలో  గుర్తించి, ప్రభుత్వ మరియు ప్రైవేట్​ హాస్పిటల్స్​  పరస్పర సహకారంతో  ప్రజలకు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించి, మరణాలను నివారించ వచ్చని చర్చలు జరిపారు.  సదస్సులో జూనియర్​ వైద్యులు, పిజి విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *