PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వణక్కం అనే మాటతో మోసం చేయలేరు !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రధాని నరేంద్ర మోదీ పై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మండిపడ్డారు. వణక్కం అనే మాటతో తమిళులను మోసం చేయలేరని మోదీని ఉద్దేశించి స్టాలిన్ అన్నారు. తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయానికి విఘాతం కలిగించడానికి పలువురు ప్రయత్నించినా కరుణానిధి వాటిని అధిగమించారని అన్నారు. వరద సాయం కోరుతూ ప్రధానికి లేఖ రాశానని, ఇప్పటి వరకు నిధులు అందలేదని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర మంత్రులు సందర్శించి వెళ్లినా లాభంలేదని అన్నారు. జీఎస్టీ, విపత్తు సాయం, ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రాలకు అందాల్సిన నిధుల గురించి ప్రశ్నిస్తే జవాబు రాదని అన్నారు. వణక్కం అని చెబితే తమిళులు మోసపోతారని భావిస్తున్నారని, కానీ తమిళులు మోసపోరని తెలిపారు.

     

About Author