PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బైకును ఢీకొన్న కారు-వ్యక్తికి గాయాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: కారు అతివేగంగా వచ్చి బైకును ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనదారుడుకి గాయాలు అయ్యాయి.మిడుతూరు మండల పరిధిలోని తలముడిపి,రోళ్లపాడు మధ్యలో ఉన్న బ్రిడ్జి క్యాంప్ దగ్గర గురువారం ఉదయం 9:15 నిమిషాలకు దేవనూరు గ్రామానికి చెందిన పుల్లయ్య తలముడిపి జిల్లా పరిషత్ పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్నాడు.విధులకు వెళుతుండగా (ఏపీ 21ఏయు 4392)ద్విచక్ర వాహనంపై తలముడిపికి వెళ్తూ ఉండగా నంద్యాల నుండి నందికొట్కూరుకు వస్తున్న డాక్టర్ జాహ్నవి దేవి కారును అతి వేగంగా డ్రైవింగ్ చేస్తూ బైక్ ను ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.బైకును ఢీకొన్న కారు పార్టీలు కొడుతూ రోడ్డు పక్కన ఉన్న ముళ్ళపదల్లో లోయలో పడింది.కారును నడుపుతున్న డాక్టర్ జాహ్నవి దేవి ప్రమాదం నుండి బయట పడ్డారు.ఈమే నంద్యాల శాంతిరాం ఆస్పత్రిలో వైదురాలిగా పనిచేస్తున్నారని ఏఎస్ఐ సుబ్బయ్య తెలిపారు.పుల్లయ్యను 108 అంబులెన్సులో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని ఏఎస్ఐ సుబ్బయ్య పరిశీలించారు.

About Author