PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతుల పై కారు దూసుకెళ్లిన కేసు.. కేంద్రమంత్రి కొడుకు అరెస్ట్ !

1 min read

పల్లె వెలుగు వెబ్ : ఈనెల 3న ఉత్తర‌ప్రదేశ్ లోని ల‌ఖింపుర్ ఖేరిలో సాగు చ‌ట్టాల‌కు వ్యతిరేకంగా రైతులు ధ‌ర్నా నిర్వహించారు. ఆ స‌మ‌యంలో రైతుల పై కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కొడుకు ఆశిశ్ మిశ్రా కారు దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు రైతులు మృతి చెందారు. అనంత‌రం చెల‌రేగిన హింస‌లో మ‌రో న‌లుగురు రైతులు మృతిచెందారు. ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. ఈ ఘ‌ట‌న‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కొడుకు ఆశిశ్ మిశ్రాను శ‌నివారం రాత్రి ఉత్తర‌ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అశిశ్ మిశ్రాను పోలీసులు ప‌లుకోణాల్లో విచారించారు. అయితే.. అత‌ను స‌రైన స‌మాధానాలు ఇవ్వలేద‌ని పోలీసులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో అతన్ని కోర్టులో హాజ‌రుప‌రిచారు.

About Author