PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిస్ వ‌ర‌ల్డ్ 2021గా కెరోలైనా బిలోస్కా

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పోలాండ్‌కు చెందిన కెరోలైనా బిలోస్కా.. మిస్‌ వరల్డ్‌ 2021 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ప్యూర్టోరికో రాజధాని శాన్‌జువాన్‌లో జరిగిన వేడుకలో 2019 మిస్‌ వరల్డ్‌ టోనీ ఆన్‌ సింగ్‌(జమైకా).. కెరోలైనాకు కిరీటాన్ని అలకరించారు. దీంతో కెరోలైనా 70వ మిస్‌ వరల్డ్‌గా నిలిచారు. భారత సంతతికి చెందిన అమెరికా యువతి శ్రీసైనీ తొలి రన్నర్‌పగా నిలువగా, ఒలియవా యాస్‌(కోట్‌ డి ఐవరీ) రెండో రన్నర్‌పగా నిలిచారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన వారాణసి మానస టాప్‌-6 రౌండ్‌కు చేరడంలో విఫలమై టాప్‌-13తో సరిపెట్టుకున్నారు.

                                               

About Author