PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీబీఐ అధికారి పై కేసు.. వివేక హ‌త్య కేసులో మ‌లుపు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కడప కోర్టు ఆదేశాలతో సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదైంది. 195ఏ, 323, 506, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రామ్‌సింగ్‌ తనను బెదిరిస్తున్నారంటూ యురేనియం కార్పొరేషన్‌ ఉద్యోగి ఉదయ్‌కుమార్‌ రెడ్డి కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసులు ఫిర్యాదు స్వీకరించకపోవడంతో ఉదయ్‌కుమార్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో రామ్‌సింగ్‌పై కడప రిమ్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ వివేకా హ‌త్య కేసులో సీబీఐ దూకుడుగా విచారిస్తోన్న నేప‌థ్యంలో సీబీఐ కీల‌క అధికారిపై కేసు న‌మోదు కావ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

                                   

About Author