PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌త్తులు దూసిన ఎమ్మెల్యేల పై కేసు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మహారాష్ట్ర మంత్రులు అస్లాం షేక్, వర్షా గైక్వాడ్ లు కాంగ్రెస్ మైనారిటీ సమావేశంలో కత్తులు దూశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ సెల్ సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ మైనారిటీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి గత ఆదివారం ముంబైకి వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రులు అస్లాం షేక్, వర్షా గైక్వాడ్ లు పెద్ద కత్తులు చేతబట్టి వాటిని పైకెత్తి దూశారు. దీంతో బాంద్రా పోలీసులు రాష్ట్ర మంత్రులపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో తమపైనే కేసులు నమోదు చేస్తారా అని మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

                                                    

About Author