PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇద్దరిపై కేసు నమోదు.. రిమాండ్  

1 min read

పల్లెవెలుగు మిడుతూరు: సారాయి మరియు మద్యం సీసాలను అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు పంపడం జరిగిందని మిడుతూరు ఎస్ఐ ఎం జగన్ మోహన్ సోమవారం తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల మేరకు మాకు అందిన సమాచారం మేరకు దేవనూరు గ్రామానికి చెందిన గోవిందు వద్దనున్న 20 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకున్నామని అదే విధంగా నాగలూటి గ్రామానికి చెందిన దేవదానం అను వ్యక్తి వద్ద నుంచి 25 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నామని అంతేకాకుండా వీరిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు. సారాయి మరియు మద్యం అమ్మినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని అంతేకాకుండా ఎన్నికల సమయంలో మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్సై అన్నారు.

About Author