NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేసులు తగ్గుతున్నాయ్…!

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 79,564 నమూనాలను పరీక్షించగా 13,756 కరోనా పాజిటివ్‌ కేసులు.. 104 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,71,742కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 10,738 మంది మృతి చెందారు. కరోనా నుంచి ఒక్క రోజులో 20,392 మంది కోలుకున్నారని.. ఇప్పటి వరకు మొత్తం 14,87,382 మంది కోలుకోని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది.

About Author