PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థినికి నగదు ప్రోత్సాహం

1 min read

– విద్యార్థినిని సన్మానించి నగదు అందజేస్తున్న పాఠశాల యాజామాన్యం

పల్లెవెలుగు వెబ్  చాగలమర్రి : చాగలమర్రి పట్టణంలోని శ్రీరాఘవేంద్ర ఉన్నత పాఠశాలలో చదువుతూ 10వ తరగతిలో 572 మార్కులు సాధించి మండల ప్రథమ స్థానం కైవసం చేసుకున్న విద్యార్థిని ప్రదీక్షకు మంగళవారం ఘన సన్మానం లభించింది. స్థానిక పాఠశాలలో కరెస్పాండెంట్ సుదర్శన్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మౌలాలి ఆధ్వర్యంలో విద్యార్థినిని సన్మానించి, రూ.10వేల నగదు బహుమతిని అందజేశారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను ముందుంచుకుని విద్యనభ్యసిస్తే అద్భుత ఫలితాలు సాధిస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమాదేవి, బద్రీ, విమల పాల్గొన్నారు.

About Author