PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు వైసీపీలో వ‌ర్గ విభేదాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లాలోని వెల్దుర్తి వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అనకాల వీధిలో రహదారి నిర్మాణంపై మాజీ జెడ్పీటీసీ సమీర్ రెడ్డి, వెల్దుర్తి మండల వైసీపీ కన్వీనర్ రవి రెడ్డిల మధ్య వర్గపోరు తలెత్తింది. సమీర్ రెడ్డికి పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మద్దతుగా నిలిచారు. దీంతో అక్రమంగా గోడ నిర్మిస్తున్న వారికే ఎమ్మెల్యే మద్దతు తెలిపారని రవి రెడ్డి ఆవేదన చెందారు. పంచాయతీ తీర్మానాన్ని కాదని పోలీసులే గోడ కట్టిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల తీరును ఖండిస్తూ రవి రెడ్డి పంచాయతీ సేవలను నిలిపి వేశారు. దీంతో రాత్రి వీధి దీపాలు, ఉదయం నుంచి తాగునీరు, పారిశుద్ధ్యం పనులు నిలిచిపోయాయి.

                                      

About Author