అదనపు క్యాజువల్ సెలవులు మంజూరు చేయండి
1 min read
ఏపీ ప్రభుత్వ నర్సెస్ అసోసియేషన్
కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రి లో పని చేస్తున్న హెడ్ నర్సులు, మహిళా స్టాఫ్ నర్సులకు ఐదు రోజులు అదనపు క్యాజువల్ సెలవులు మంజూరూరు చేయాలని A.p govt నర్సెస్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రి బాయి కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎం.లీలావతి, జిల్లా సెక్రటరి సి.బంగారి, ఈసిలు యుఎం. శాంతి లత తదితరులు పాల్గొన్నారు.