PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మల్లన్న భక్తులకు తిప్పలు’…ఎఫెక్ట్​

1 min read

పల్లెవెలుగు వెబ్​: ఉగాది పర్వదిన ఉత్సవాలను పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో దేవస్థాన సిబ్బంది, అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా దేవస్థానం పరిధిలో ఒకటి మాత్రమే కొబ్బరికాయ కౌంటర్​ ఏర్పాటు చేశారు. ‘ మల్లన్న భక్తులకు తిప్పలు’ అనే శీర్షికతో పల్లెవెలుగు వెబ్​ మీడియాలో ప్రచురించిన వార్తకు ఆలయ సిబ్బంది స్పందించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొబ్బరికాయ కౌంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్​ నేపథ్యంలో…. మంగళవారం ఉదయం ప్రైవేటు వ్యక్తులకు టెంకాయ  విక్రయించేందుకు అనుమతి ఇచ్చారు.  దీంతో కొబ్బరికాయల సమస్యకు పరిష్కారం లభించిందని భక్తులు వెల్లడించారు.

About Author