PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గోదారిలో కొట్టుకుపోయిన ప‌శువుల కాప‌రులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కోన‌సీమ జిల్లా ఐనవెల్లి మండలం, ఎలకలంక గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. ఎలకలంక గ్రామానికి చెందిన 15 మంది రైతులు లంకలో ఉండే పశువులను ఒడ్డుకు తీసుకువచ్చేందుకు ఇంజక్షన్ పడవపై వెళ్లారు. పశువులను తీసుకువస్తున్న సమయంలో గోదావరి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో పడవ మధ్యలోనే ఆగిపోయింది. గోదావరి ఉధృతికి ఏడు కి.మీ. కొట్టుకుపోయారు. విషయాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో కోటిపల్లి దగ్గర అధికారులు ఇంజన్ బోట్ల సాయంతో రైతులను కాపాడారు.

                                                    

About Author