NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీబీఎస్ఈ ఫ‌లితాలు విడుద‌ల

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం సీబీఎస్‌ఈ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లో చూడొచ్చని పేర్కొంది. మొత్తంగా 92.71 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించింది. ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. బాలుర కంటే బాలికలు 3.29 ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. అమ్మాయిలు 94.54 శాతం, అబ్బాయిలు 91.25 శాతం ఉత్తీర్ణులయ్యారు. తిరువనంతపురంలో 98.83 శాతం, బెంగళూరులో 98.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 33 వేల మంది విద్యార్థులు 95 శాతానికి పైగా స్కోర్ సాధించారు. 1.34 లక్షల మంది 94 శాతానికి పైనే మార్కులు వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

                                          

About Author