PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కడుమూరులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో సీసీ రోడ్డు పనులకు గురువారం మధ్యాహ్నం గ్రామ సర్పంచ్ ఎస్ జీవరత్నం మరియు గ్రామ వైసీపీ నాయకులు శంకర్ రెడ్డి టెంకాయలు కొట్టి రోడ్డు పనులను వారు ప్రారంభించారు.గ్రామంలోని కర్రెమ్మ గుడి వద్ద నుండివాల్మీకి గుడి వరకు ఉపాధి హామీ పథకం నిధులు 12 లక్షలతో రోడ్డుపనులు చేయిస్తున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం వేసినటువంటి రోడ్డు  అస్తవ్యస్తంగా మారడంతో ఈ రోడ్డు వేయడం వలన గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి బి.శివ కళ్యాణ్ సింగ్,కాంట్రాక్టర్ తువ్వా వెంకట నాగిరెడ్డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ జె.రమేష్,వైసీపీ మండల ఉపాధ్యక్షులు ఎం.అన్వర్ భాష,మైనార్టీ నాయకులు రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

About Author