PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోగొట్టుకున్న చరవాణిలను బాధితులకు అందజేసిన సిసిఎస్ సిఐ

1 min read

– కృతజ్ఞతలు తెలిపిన బాధితులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : విలువైన తమ చరవాణులు పోగొట్టుకున్న వివిధ ప్రాంతాలకు చెందిన 20 మంది వ్యక్తుల సెల్ ఫోన్ లు సి.సి.ఎస్ సి ఐ చేతుల మీదుగా కొంతమందికి అందజేశారు. గతంలో కూడా రికార్డు స్థాయిలో ఎస్పీ చేతుల మీదుగా సిసిఎస్ సి ఐ మురళీకృష్ణ ద్వారా అందించడం ఒక సంచలనంగా చెప్పవచ్చు ,సెల్ ఫోన్ తమ దయనందన జీవితంలో ఒక భాగం అయిపోయినది, అందులో అనేక ఙ్ఞాపకాలను,బ్యాంకు పాస్వర్డ్ ,ఫోటోలను భద్రపర్చబడి మన రోజువారి కార్యక్రమాలలో కీలక పాత్ర వహిస్తుంది. మనం కనుక చరవానిలను విలువైన ఒక వస్తువుగా జాగ్రత గా కాపాడుకోవాలని సి ఐ మురళీకృష్ణ సూచించారు.

About Author