PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత్యంత వైభవంగా హనుమంతుని జన్మదిన వేడుకలు

1 min read

– హనుమంతుని కార్యనిరతి అందరికీ ఆదర్శం

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు శివారులోని గోదాగోకులం ఆంజనేయ స్వామి ప్రాంగణంలో హనుమజ్జయంతి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం పంచామృతాభిషేకం, ఆకుపూజ, డాక్టర్ తొగట సురేశ్ బాబుచే సుందరాకాండ సంపూర్ణ పారాయణం, గోదా పరివారంచే హనుమాన్ చాలీసా పారాయణం, వేదపండితులు రమేషాచార్యులచే మన్యుసూక్త హోమం, 516 వడలచే వడమాలాలంకరణ, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు హనుమంతుని వైభవం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, శ్రీగోదా రంగనాథ రామానుజ కూటమి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మారం నాగరాజు గుప్త, మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు  యం.రాంభూపాల్ రెడ్డి, మారం లలిత, ఇల్లూరి సింధు రామయ్య, పాలాది సునీతా సుబ్రహ్మణ్యం,పెరుమాళ్ళ సునీతా సుధాకర్, మేడా సరిత, శ్యామల, శివ జ్యోతి, మహేశ్వరరెడ్డి, ఇటిక్యాల పుల్లయ్య, శ్రీనాథ్, మాకం శ్రీనివాస్, పాలాది వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

About Author