PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ఏసు పునరుత్థాన వేడుకలు

1 min read

– నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌
పల్లెవెలుగు వెబ్ గుంటూరు : మేడికొండూరు మండలం, మందపాడు గ్రామంలోని పెంతికోస్టల్‌ హోలీనెస్‌ చర్చిలో ఆదివారం పాస్టర్‌ జక్రయ్య ఆధ్వర్యంలో క్రీస్తు పునరుత్థాన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పునరుత్థానమును, జీవమును నేనే. నాయందు విశ్వాసముంచి ప్రతివాడును చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికినీ చనిపోడు’’ అని ఏసు వాక్యాలను గుర్తు చేసుకొనవలెనన్నారు. ఈస్టర్‌ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగినవి. ఈ సందర్భంగా జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ దైవ సేవకులు జక్రియను శాలువాతో సత్కరించి, దైవ సేవకులకు విశ్వాసులకు క్రీస్తు పునరుత్థాన శుభాకాంక్షలు తెలిపారు.

About Author