NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మోక్ష నారాయణ స్వామిని దర్శించుకున్న ప్రముఖులు

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు: కడప జిల్లా కమలాపురం మండలం శ్రీరామపురంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మీ మోక్ష నారాయణ స్వామి శ్రీ వల్లీ దేవసేన షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామీ సంజీవిని సహిత శ్రీ వీరాంజనేయ స్వామి ఉగ్ర భైరవ దేవి కౌళిని మహాదేవి దేవతా మూర్తులను రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఎం వి మైసూరారెడ్డి, కమలాపురం శాసన సభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ఆర్ టి సి ఛైర్మెన్ అబ్బిరెడ్డి మల్లిఖార్జున రెడ్డి తదితరులు దర్శించుకున్నారు.

అనంతరం భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన ప్రముఖులకు ఆలయ ప్రధాన సేవకులు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ ఆయన తనయుడు మణికంఠ శర్మ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు జగదీష్ శర్మ ప్రదీప్ శర్మ పూజలు అర్చనలు చేసీ ఆశీర్వచనం చేసారు.. దేవాలయ ప్రాముఖ్యతను ఆలయ విశిష్టతను సాయినాథ్ శర్మ వారికీ వివరించారు. ఆలయానికి విచ్చేసిన ప్రముఖులకు దేవతా మూర్తుల శేష వస్త్రంతో ఆశీర్వచనం చేసీ సన్మానించారు.

About Author