NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రామాలయానికి సిమెంట్ వితరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని దౌలతాపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని దౌలాతాపురం గ్రామస్తులు సోమవారం యువ నాయకులు చింతకొమ్మ జెడ్పిటిసి పోచం రెడ్డి నరేన్ రామాంజనేయులు రెడ్డి నీ కోరగా, ఆయన వెంటనే స్పందించి ఆలయ నిర్మాణానికి తమ వంతుగా ఏం చేయాలో చెప్పాలని గ్రామస్తులను అడుగగా వారు ఆలయ నిర్మాణానికి సరిపడ సిమెంటును అడుగగా ఆయన వెంటనే అంగీకరించి ఆలయ నిర్మాణ మునకు ఎంత మొత్తం సిమెంట్ అవసరమైతే అంత సిమెంటు ఇస్తానని గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగిందని వైయస్ఆర్ సీపీ నాయకులు తెలిపారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు నాగినేని వెంకటరమణ, సుబ్బారెడ్డి, కరుణాకర్, కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సత్య, శివరాం తదితరులు పాల్గొన్నారు.

About Author