PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విమాన సర్వీసులపై కేంద్రం ఆంక్షలు ఎత్తివేత! 18నుంచి అమల్లోకి

1 min read

పల్లెవెలెగువెబ్​, ఢిల్లీ: కరోనా ప్రాబల్యం నేపథ్యంలో విమాన సర్వీసుల నిర్వహణపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా మొదటి, రెండో వేవ్​ల ప్రభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విదేవీ యాన ప్రక్రియలో పలు విమాన సర్వీసులను నిషేధించడంతోపాటు మరికొన్ని సర్వీసుల్లో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రపయాణించాలని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే కరోనా కేసులు అదుపులో ఉండడంతో కేంద్రం నెల 18నుంచి విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడంతోపాటు పరిమిత అంక్షలు ఎత్తివేస్తూ చర్యలు తీసుకుంటుంది. కరోనా ప్రభావం ఉన్న రోజుల్లో విమానాల్లో 80శాతం, 72, 65, 50, 33 శాతం.. ఇలా పరిస్థితులకు అనుగునంగా ప్రయాణికులకు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఉండేది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విమాన సర్వీసులను పూర్తి సామర్థ్యంతో నిర్వహించవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.

About Author